రాయ్గంజ్: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు.
దినాజ్పూర్ జిల్లా చోప్రాలోని డిగిర్పూర్ పోలింగ్ స్టేషన్లో తమని ఓటు వేయకుండా అడ్డుకున్నారనీ,తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ను తమ అధీనంలోకి తీసుకున్నారనీ స్థానికులు ఆరోపించారు. 34 వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పోలీసులు ఆందోళన కారును వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవటంతో లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొందరు పాలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
ఇదే రాయ్గంజ్ నియోజకవర్గంలో 112 బూత్ వద్ద తృణమూల్ కాంగ్రెస్, బిజెపి వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఈవిఎంలు కూడా ధ్వంసమయ్యాయి.
రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో నిజల్పైగురి, డార్జిలింగ్,రాయ్గంజ్ లోక్ సభ స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతున్నది.