టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పొలిటికల్ జర్నీ ఆరంభ శూరత్వం తరహాలో ఉందన్న టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నారా లోకేష్… ఇటీవల రాష్ట్రంలో వరదలు ముంచెత్తిన తరుణంలో బయటకు రావడం జరిగింది.
ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నీట మునిగిన పంట పొలాలు రైతులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. పంటనష్టాన్ని అంచనావేసి వెంటనే రైతులకు న్యాయం చేయాలని… ఏకంగా ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా పొలంలో కి వెళ్లి మరి లోకేష్ పోరాటానికి దిగారు. కరోనా సమయంలో చాలా వరకు హైదరాబాదులో తండ్రి చంద్రబాబుతో ఉండి బయటకు రాలేదు.
ఆ సమయంలో ఎక్కువగా లోకేష్ సోషల్ మీడియా లోనే ఉంటూ పోస్ట్ లు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో ట్విట్టర్ బాబు అనే విమర్శలు కూడా లోకేష్పై వచ్చాయి. ఎవరైనా ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్య ఉండే ప్రభుత్వంతో పోరాడతారనీ… కానీ లోకేష్ పోరాటమంతా సోషల్ మీడియాలో నే అంటూ ప్రత్యర్థులు తెగ విమర్శలు చేశారు. కాగా ఇటీవల వర్షాలు భారీ స్థాయిలో పడటంతో రైతులు బాగా నష్టపోవడంతో… మొన్నటిదాకా పంట పొలాలలో హడావిడి చేసిన లోకేష్ మళ్ళీ ఇప్పుడు కనిపించకుండా ట్విట్టర్ కి పరిమితం అవ్వటంతో… విమర్శలు వస్తున్నాయి. లోకేశ్ ఇలానే ఉంటే రాజకీయాల్లో రాణించలేరు అనే టాక్ కూడా బలంగా వినపడుతోంది.