Chandrababu Pawan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ కలిసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి జిల్లాల్లో వారు పర్యటించనున్నారు. ఇద్దరూ కలిసి రెండు నియోజకవర్గాల్లో నేడు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కూటమి ఏర్పడిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో మరో సారి ఇద్దరు నేతలు కలిసి పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఇద్దరు ప్రచారాన్ని నేడు, రేపు నిర్వహించనున్నారు.
ఇవేళ తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పవన్, చంద్రబాబు పాల్గొననున్నారు. తణుకులో టీడీపీ అభ్యర్ధి అరిమిల్లి రాధా కృష్ణ బరిలో ఉండగా, నిడదవోలులో జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ పోటీ లో ఉన్నారు. అలానే రేపు పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో పవన్, చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహిస్తారు. రోడ్ షో లో కూడా పాల్గొంటారు.
పి గన్నవరంలో జనసేన నుండి గిడ్డి సత్య నారాయణ, అమలాపురంలో టీడీపీ నుండి అయితాబత్తుల ఆనందరావు అభ్యర్ధులుగా బరిలో ఉన్నారు. ఇవేళ నిడదవోలు సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా హజరుకానున్నారు. రేపు పి గన్నవరం, అమలాపురం సభల్లో ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్ధులతో పాటు లోక్ సభ టీడీపీ అభ్యర్ధి గంటి హరీష్ మాధూర్ పాల్గొంటారు.
Congress: ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల సెకండ్ లిస్ట్ విడుదల