TDP Janasena: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ, జనసేన దృష్టి పెట్టాయి. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇక ఆలస్యంగా చేయకూడదని భావించి ముందుగా వివాదం లేని స్థానాలకు ఉమ్మడిగా అభ్యర్ధులను ప్రకటించాలని ఇరు పార్టీల అధినేతలు డిసైడ్ అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇందు కోసం మూహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మొదటి లిస్ట్ టీడీపీ నుంచి 50, జనసేన నుండి 15 నుండి 20 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తొంది. ఫస్ట్ లిస్ట్ ను అధికారికంగా రేపు (శనివారం) ఉమ్మడి జాబితా ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు లిస్ట్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలని పార్టీ కార్యాలయాల నుండి సమాచారం అందించారు.
శనివారం ఉదయం 9 గంటల కల్లా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ నకు ఉదయం 11.40 గంటల మూహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తొంది. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ నుండి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరికి చేరుకున్నారు. దీంతో రేపు ఫస్ట్ లిస్ట్ విడుదల పక్కా అనే సమాచారం అందుతోంది.