TDP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టెక్కలి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
ప్రస్తుతం శ్రీకాంత్ టెక్కలి 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్ గా ఉన్నారు. ఆయనతో పాటు కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ తో పాటు పలువురు నేతలు వైసీపీకి బైబై చెప్పి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వీరు పార్టీలో చేరారు.
వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో వైసీపీకి ఇది షాకింగ్ పరిణామంగా భావిస్తున్నారు. సొంత సోదరుడే పార్టీని వీడి వెళ్లడం వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ కు ఇబ్బందికరమని అంటున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధి కే రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు