Earthqeakes: ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేఘాలయ, అసోం, మణిపూర్ రాష్ట్రాలలో భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు వేకువజామున కొన్ని గంటల వ్యవధిలో ఆ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు ప్రకటించారు.
మేఘాలయలోని పశ్చిమ కాశీకొండ ప్రాంతంలో వేకువ జామున 4.20 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 2.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అసోంలోని తేజ్ పుర్ లో అర్థరాత్రి దాటిన తరువాత 2.04 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.1 గా నమోదు అయ్యిందని వెల్లడించారు. తేజ్ పుర్ కు పశ్చిమ – వాయవ్య దిశగా 36 కిలో కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మణిపూర్ లోని ఛాందెల్ ప్రాంతంలో 1.06 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కెల్ పై 3.0 గా భూకంప తీవ్రత నమోదైంది.
Earthquakes of magnitude 4.1, 3.0, and 2.6 on the Richter Scale hit Sonitpur (Assam), Chandel (Manipur), West Khasi Hills (Meghalaya) respectively today: National Center for Seismology pic.twitter.com/DM9rNmMmWB
— ANI (@ANI) June 17, 2021