couples: ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరి జీవితం లో బిజీ తో ఒత్తిడి ఆందోళలు నిండిపోయాయి. ఎప్పుడు బిజీ గా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఎదురుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలోఆలుమగలు రాత్రిసమయంలో కలిసి నిద్రపోవడం వల్ల ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతం గా నిద్ర పోతారు. దింతో పొద్దున్న లేచేసరికి మెదడు చురుకుగా వుండటంతో తిరిగి పనిచేయటానికి ఉత్సాహంగా ఉంటారు. భార్యాభర్తలు కలిసి నిద్రపోవటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..
భాగస్వామి తో కలిసి ఒకే మంచం మీద నిద్ర పోవటం వల్ల సురక్షితంగా, భద్రతతో ఉన్నామన్న భావన తో పాటు శరీరానికి వెచ్చదనం కలిగి ఎక్కువ సమయం బాగా నిద్ర పడుతుంది. మనం ఒంటరిగా పడుకున్నప్పుడు, ఎక్కువసేపు ఆఫీసు పనులగురించి, లేదా ఇతర పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాము. ఇలాంటి ఆలోచనలు రాత్రంతా మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తాయి. అలాకాకుండా కలిసి నిద్రపోయేటప్పడు ఇతర విషయాలు వదిలేసి పేమగా మాట్లాడుకుంటూ స్పర్శించుకుంటూ ఉండటం వలన త్వరగా నిద్రలోకి వెళ్లిపోతారు. ఇలా నిద్ర పోవటం వలన శారీరకంగానూ, మానసికంగానూ మంచి విశ్రాంతి లభిస్తుంది .జంటలు నిద్ర కు ముందు శృంగారం చేయడం వల్ల యాక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల జరిగి మీలో సంతోషాన్ని పెంచి మానసికంగా ఆహ్లాదాన్ని పెంచి త్వరగా నిద్రలోకి వెళ్లేలా చేస్తుంది. దీనితో సంతోషాన్ని పాటు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాకూడా ఒకే మంచం మీద పడుకోవటం వలన అవి కొంత సేపటికి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలా పడుకున్నప్పుడు గొడవకు కారణం అయినా వారు,లేదా పోనిలే అని సర్దుకు పోయి ఎదుటువారి కోపం తగ్గించాలి అనుకున్నవారు తమ భాగస్వామి మీద చేయివేసి తమ శాంతి ఒప్పందం తెలియచేయటం వలన గొడవలు సద్దుమణిగి తెల్లారేసరికి ప్రశాంతం గా ఉంటారు.నిద్ర లో మెలుకవ వచ్చినప్పుడు పక్కన భాగస్వామిని చూటేసి పడుకుంటే ఇద్దరిలోను ప్రశాంతత ఒకరికోసం ఒకరం అన్న భావనతో మనస్సు పులకిస్తుంది అని కాబట్టి భర్య భర్తలు గొడవ పడినాకూడా ఒకే మంచం మీద పడుకోవటం వలన సమస్య తీవ్రత తగ్గుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.