చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా అమరావతి ఉద్యమానికి తెర లేపడంతో రాష్ట్ర రాజకీయమంతా దాని చుట్టూనే తిరగడం మొదలయింది. జగన్ మూడు రాజధానుల ప్రపోజల్ పెట్టినప్పటి నుండి మళ్లీ అదే రేంజ్ లో ఈ విషయం తెర మీదకు వచ్చి పరిస్థితులు అంతా హీట్ ఎక్కడం కూడా ఇప్పుడే. ఈ క్రమంలో వైకాపా, టిడిపి మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సంగతి పక్కన పెడితే ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బిజెపికి చుట్టుకునేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడిప్పుడే ఏపీలో తమ ఉనికిని చాటుదామని సన్నాహాలు మొదలు పెడుతున్న బిజెపి వారు రాజధాని విషయంలో ద్వంద్వ వైఖరి కనబరుస్తున్నారు. ఇక ఈ ప్రాంతాలకు న్యాయం చేస్తూ వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్లాలా లేక రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న అమరావతిని రాజధానిగా ఉంచాలన్న వాదనౌ సమర్థించాలా అన్న్న విషయంపై బీజేపీ నేతలు…. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ఇంకా ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా పూర్తి కాలేదని చెబుతున్నారు. అయితే ఎప్పుడూ చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేచే పురందేశ్వరి మాత్రం తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది.
అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి మొదలుపెట్టిన పురందేశ్వరి… బీజేపీ తొలి నుంచీ అమరావతికి అనుకూలంమే అని చెప్పేస్తున్నారు. దీనిని ఆమె వ్యక్తిగత అభిప్రాయం గానే పరిగణించాలి కానీ ఈ విషయంలో మాత్రం పురందేశ్వరి బాబు కి ఎందుకు మద్దతుగా మాట్లాడారు అన్న విషయం పై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ఏపీ బీజేపీ ప్లాన్ లో ఒక భాగమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు జగన్ కు సపోర్ట్ చేస్తే మూడు రాజధానుల విషయంలో సానుకూలంగా ఉన్న ప్రజలంతా వైయస్సార్ సిపి వైపు మొగ్గు చూపుతారు తప్ప బిజెపికి రూపాయి ఉపయోగం ఉండదు. అలాగని దాన్ని వ్యతిరేకిస్తే ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు వీరు శత్రువులు అయిపోతారు. అందుకని ముందుగా పురందేస్వరితో ఒక ట్రయల్ వేసినట్లు రాజకీయ వర్గాలు ఏపీ చెప్పుకుంటుస్తున్నాయి. అయితే బిజెపి మాత్రం ఏదో ఒక రోజు ఏపీ రాజధాని పై తన స్టాండ్ ను ప్రజలకు చెప్పి తీరాల్సిందే కదా…