కేంద్ర ప్రభుత్వం చౌక ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి భారీగా కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటం హాట్ టాపిక్గా మారింది.
కేంద్రం యూనిట్ 2.70కి ఇస్తుంటే, ఏపీలోని వైసిపి ప్రభుత్వం ప్రజల నుంచి రూ.9 యూనిట్ ధర తీసుకుంటుందని తెలుసుకుని, షాక్ అయ్యానని, ఈ కరోనా టైంలో ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, ప్రజలను ఇబ్బంది పెట్టద్దొని ఆమె కోరడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేగాక పీపీఏల విషయంలో, రాష్ట్రం అనుసరించిన విధానం వల్ల, అంతర్జాతీయంగా ఇబ్బంది వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలోనే ప్రస్తుత అమలవుతున్న కరెంటు టారిఫ్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేశాయి ప్రజలు కూడా జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఈ తరహా విమర్శలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారైంది.ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కరెంట్ చార్జీల విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వడానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం.ఏ పరిస్థితుల్లో కరెంటు చార్జీలు పెరిగింది అసలు ఎందుకు ఇంతగా బిల్లులు వచ్చింది తదితరాంశాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
ఆదిలోనే ఈ తరహా విమర్శలను ఖండించకపోతే ప్రజలకి కూడా అనవసరమైన అపోహలు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.పైగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటనను ప్రతిపక్షాలు కూడా అస్త్రంగా చేసుకుని మళ్లీ దాడి కొచ్చే పరిస్థితి రాకుండా నివారించటానికి ముందే జాగ్రత్త పడాలని జగన్ ప్రభుత్వం వ్యూహం రచించిందని అధికార వర్గాలు తెలిపాయి