అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు, స్మశానవాటికలు, ఓవర్ హెడ్ ట్యాంక్లకు వైసిపి రంగులు వేసిన ఫోటోలను ట్యాగ్ చేస్తూ రంగులేసుకోవడానికి, ఆర్బాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసిపి అని కన్నా విమర్శించారు.
150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్గా ఇసుక కృతిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులకు 150 రూపాయలు కూలీ కూడా రాని పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందనీ, ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఇంత వరకూ చూడలేదనీ కన్నా వ్యాఖ్యానించారు.
రంగులేసుకోవడానికి,ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ.
150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు. pic.twitter.com/kBej9Ge3E7
— Kanna Lakshmi Narayana (@klnbjp) October 28, 2019