విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని అన్నారు. నిన్న ఢిల్లీ పర్యటనలో సిఎం జగన్ ఎన్ అర్ సికి వ్యతిరేకమని మోడీకి, అమిత్ షాకు చెప్పొచ్చు కదా అని అన్నారు. బిజెపికి అత్యంత విశ్వాసపాత్రమైన కావలాదారు వైసిపియేనని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రతి ఒక్కరికి ఒక్క వాడకంగా మారిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో రాష్ట్ర ప్రయోనాలంటూ మాట్లాడారు కాని ఏం సాధించారని ప్రశ్నించారు. మండలి రద్దు రాష్ట్ర ప్రయోజనం ఎలా అవుతుందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బిజెపి చెప్పినా వారి కాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
చేగు వీరా విప్లవమని మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కనున్నారో ఆలోచించాలన్నారు. రెండు సార్లు ఢిల్లీ వెల్ళిన జగన్ ఏమి సాదించారో చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. గతంలో ఢిల్లీ లో అపాయింట్ మెంట్ ఇవ్వని వారికి ఇప్పుడు అపాయింట్ మెంట్ దొరికిందన్న ఆనందంలో ఉన్నట్టున్నారని అయన వ్యాఖ్యానించారు. రాజధాని పై తలో ప్రకటనలతో బిజెపి నాటకాలాడుతుందని విమర్శించారు. రాయలసీమలో ఉండే రాజధానిని గతంలో త్యాగం చేసామనీ, ఇప్పుడు మా రాజధాని మాకివ్వమని అడుగుతున్నామన్నారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ దినిపై మాట్లాడడం లేదన్నారు. రాయలసీమ వాసులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని అన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరదం పడుతున్నారనీ, జిల్లాల పర్యటనలో పార్టీని వీడిన వారంతా వెనక్కి రావడం పార్టీ బలోపేతానికి నిదర్శనమనీ శైలజానాథ్ అన్నారు.