(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు 29వ రోజుకు చేరుకోగా మందడంలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపిలు జెసి దివాకరరెడ్డి, మాగంటి బాబు, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో పండుగ జరుపుకోకూడదని నిర్ణయించుకొని రైతుల మధ్యకు వచ్చామని అన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి ఎడ్ల పందాలు చూసేందుకు వెళ్లడాన్ని ఆయన ఆక్షేపించారు. సిఎం చెప్పినట్లుగానే కమిటీ రిపోర్టులు ఇచ్చారని మాగంటి ఆరోపించారు. ఈ ఏడు నెలల కాలంలో జగన్ నోటి వెంట అమరావతి అనే మాట వినబడలేదని ఆయన విమర్శించారు.