తెలంగాణ రాజకీయాలలో కీలక రాజకీయ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి చుక్కలు చూపించే ప్రత్యర్థిగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఢిల్లీ నేతలను సైతం ఆకర్షిస్తూ రాజకీయాలు చేస్తున్న కేసిఆర్ మొదటిలో టిడిపిలో కీలక రాజకీయ నేతగా రాణించారు. రాష్ట్రం విడిపోయినా సరే చంద్రబాబు కి శిష్యుడిగా తెలంగాణ టిడిపిని ముందుండి నడిపించారు.ఆ తర్వాత పార్టీ చాలా వరకు తెలంగాణలో డ్యామేజ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో జంపు అయ్యి టీ కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి జగన్ కి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో చుక్కలు చూపించడానికి రెడీ అయినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కేంద్రం దాకా కూడా వెళ్లాయి. మరి ఈ విషయంలో కేసిఆర్ ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కృష్ణా బేసిన్ నుంచి వైయస్ జగన్ సర్కార్ 12 టిఎంసిలు ఎత్తి పోసుకునే పనులు ప్రారంభిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యమకారులను తరిమికొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వటం సిగ్గుచేటు అన్నట్టుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి దిగితే తప్ప రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి రాదని స్పష్టం చేశారు. మొత్తంమీద చూసుకుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ ని కార్నర్ చేస్తూ కేసిఆర్ ని పొలిటికల్ గా దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.