2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో దేశంలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక దేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మోడీ పేరు ప్రస్తుతం మారుమ్రోగుతోంది. కరోనా వైరస్ ఇంకా చైనాతో డీలింగ్ వంటి విషయాలలో చాలా దూకుడుగా మోడీ తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మీడియాలో సైతం అందరిని ఆలోచింప చేసే విధంగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీలో మోడీ తిరుగులేని నాయకుడిగా రాణిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో అదే రీతిలో మరో బీజేపీ యువ నాయకుడు రాణిస్తున్నట్లు పార్టీలో టాక్ వినపడుతోంది. అతడు వ్యవహరిస్తున్న తీరుకు అందరూ అతన్ని జూనియర్ మోడీ అని కూడా అంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక పూర్తి విషయంలోకి వెళ్తే దక్షిణాది లో బీజేపీ పార్టీ కి పెద్దగా బలం లేదన్న సంగతి తెలిసిందే. కానీ 2019 ఎన్నికల్లో బెంగళూరు నుంచి తేజస్వి సూర్య ఎంపీగా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం బిజెపిలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నాడు.
మోడీ మాదిరిగానే మంచి వాక్చాతుర్యం, విషయ స్పష్టత, సూటిగా సుత్తి లేకుండా ప్రత్యర్థులను ఇరుకున పెట్టే రీతిలో అదరగొడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్న తేజస్వి సూర్య బిజెపి అధిష్టానం ఇటీవల యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కాగా మరి కొద్ది నెలల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… ఆ ఎన్నికల బాధ్యతను పూర్తిగా ఈ యువ నాయకుడు కి కట్టబెట్టారు.
జాతీయ స్థాయిలో తేజస్వి సూర్య పేరు మారుమ్రోగే టంతో ఎన్నికలను నడిపించడానికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో యువనేత ఎయిర్పోర్టులో అడుగుపెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తేజస్వి సూర్య ఎక్కడికి వెళ్ళినా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడుతూనే వ్యవహరిస్తున్నారు. కానీ మరోపక్క తేజస్వి సూర్య మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా… మమతా బెనర్జీ సర్కార్ పై తీవ్ర విమర్శలను కురిపిస్తూ సమర్థవంతంగా రాణిస్తున్నారు. దీంతో ఈ యువనేత ధైర్యం చూసి బిజెపి అధిష్టానం పెద్దలు కూడా సరైన నాయకుడు బిజెపికి దక్షిణాది నుండి దొరికాడని అంటున్నట్లు టాక్.