డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వం ,పోలీసుల పాత్ర వివాదాస్పదమైన విషయం మరుగున పడకముందే మరో మహిళా దళిత డాక్టర్ తనకు కూడా వైసీపీ నేతల నుండి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని హైకోర్టుకెక్కారు.
వైసీపీ నేతలు తనను దారుణంగా వేధించారని ఆరోపిస్తూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళా డాక్టర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత డిసెంబర్లో చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం)లోని పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో అనితారాణి అనే డాక్టర్ విధుల్లో చేరారు. కింది స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. జనతా కర్ఫ్యూ రోజున.. తనను హాస్టల్ గదిలో నిర్బంధించి.. .వైసీపీ నేతల్ని పిలిపించారని.. వారంతా.. తనను వేధించారు. దుర్భాషలాడారని అనితా రాణి ఆరోపిస్తున్నారు. బాత్రూమ్లోకి వెళ్లినా ఫొటోలు, వీడియోలు తీశారని.. కోర్టులో వేసిన పిటిషన్లోనూ పేర్కొన్నారు. వైసీపీ నేతల వేధింపులకు సాక్ష్యాలుగా వీడియోలు కూడా ఉన్నాయని.. ఆ వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ అనితా రాణి అంటున్నారు. దీంతో ఆ డాక్టర్ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సలహామేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రభుత్వానికి ఈ వ్యవహారం మచ్చ తెచ్చేదిగా ఉంది.