జగన్ ఆల్ రెడీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయారు. సోమవారం సాయంత్రమే పులివెందుల నుండి డైరెక్ట్ గా జగన్ ఢిల్లీకి భయం అవ్వటంతో… అక్కడే రాత్రి బస చేశారు. మరి కొద్ది గంటల్లో ప్రధాని మోడీ తో భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా గతంలో మాదిరిగా కాకుండా జగన్ ఢిల్లీ వస్తున్నారంటే బీజేపీ నేతలు రెడ్ కార్పెట్ వేసే రీతిలో వెల్ కామ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుండి ఇటీవల కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోతున్న తరుణంలో జగన్ పార్టీని ఎన్డీయేలోకి లాగాలని బిజెపి యోచన చేస్తున్నట్లు టాక్.
అందుకోసం దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని బిగ్ ఫర్ జగన్ పార్టీకి మోడీ ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే కేంద్రంలో రెండు కీలక శాఖల తో పాటు ఇండిపెండెంట్ చార్జీతో ఒక సహాయ మంత్రి పదవిని జగన్ పార్టీకి ఇవ్వటానికి బిజెపి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో జగన్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి బిజెపి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్.
దీంతో మరికొద్ది గంటల్లో జగన్ మోడీతో భేటీ లో క్లారిటీ రానున్నట్లు టాక్. ఏదిఏమైనా జగన్ చేపట్టిన ఈ సారి ఢిల్లీ పర్యటన కేంద్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క బీజేపీతో వైసీపీ కలుస్తున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ పార్టీలో నాయకులు వాటిలో వాస్తవం లేదని ఏపీ మీడియా ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు. మరోపక్క విపక్షా పార్టీల నాయకులు మాత్రం కేసులు మాఫీ చేసుకోవడానికి జగన్ అస్తమానం ఢిల్లీ పర్యటన చేస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు.