అమరావతి, జనవరి 17: ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి కేసులో తమకు సిట్ అధికారులు సహకరించడం లేదంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విజయవాడ ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్ అధికారులు కేసుకు సంబంధించిన ఆధారాలు తమకు అందించడం లేదని ఎన్ఐఎ అధికారులు ఆ పిటిషన్లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తును ఎన్ఐఎకు అప్పగించింది. రాష్ట్రప్రభుత్వం కేంద్రం వైఖరిని నిరసిస్తున్నది
కోర్టు అనుమతితో ఎన్ఐఎ అధికారులు నిందితుడు శ్రీనివాసరావును ఐదు రోజులుగా విచారించారు. విచారణలో సిట్ అధికారుల ముందు చెప్పిన మాటలే చెప్పినట్లు తెలుస్తుంది. సిట్ అధికారులకు కొత్త పాయింట్ ఏమి లభించలేదు. నిందితుడి విచారణ గురువారంతో పూర్తి చేసి ఎన్ఐఎ అధికారులు శుక్రవారం అతన్ని జైలుకు హజరుపర్చాల్సి ఉంది.
ఎన్ఐఎ అధికారుల విచారణలో నిందితుడు బహిరంగంగా లైడిటెక్టర్ టెస్ట్కు అయినా సిద్ధమని చెప్పినట్లు సమాచారం.
సిట్ అధికారులు తమకు కేసుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడం లేదంటూ ఎన్ఐఎ అధికారులు గురువారం విజయవాడ ఎన్ఐఎ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.