హైదరాబాద్: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గురువారం వైసిపిలో చేరారు. లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఎస్విని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎస్వి మాట్లాడుతూ… టిడిపి నుండి వైసిపికి రావడం సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని అన్నారు. జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదనీ, పార్టీ మారి తామే అన్యాయం చేశామనీ ఎస్వి చెప్పారు. చంద్రబాబు పదవి ఇస్తానన్నా వద్దని వైసిపిలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కర్నూలులో వైసిపిని గెలిపించి జగన్కు కానుకగా ఇస్తానని ఎస్వి తెలిపారు.
ఎస్వి 2014లో కర్నూలు నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి టిజి వెంకటేష్పై విజయం సాధించారు. అనంతరం వైసిపిని వీడి ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ దక్కుతుందని ఎస్వి భావించారు. కానీ చంద్రబాబు ఈ స్థానాన్ని టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్కు కేటాయించారు. దీంతో ఎస్వి అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?