అమరావతి: ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకు పత్రికా కథనాలే నిదర్శనమంటూ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.
‘నా మీద కక్షతో నేను నిలబెట్టిన వాటిని కూల్చేపని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి’ అని చంద్రబాబు సూచించారు.
ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వారు, ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని 'ముంచుతున్న' ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారనడానికి ఈ పత్రికాకథనాలే నిదర్శనం. నా మీద కక్షతో నేను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి. pic.twitter.com/WSPjGniySz
— N Chandrababu Naidu (@ncbn) November 16, 2019