NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘వాళ్లేం మాట్లాడరేంటి?’…టిడిపి శ్రేణుల మథనం

‘తలసాని’ వ్యవహారం టిడిపి అంతర్గత వ్యవహరాల్లోనూ చిచ్చుపెడుతోంది. కారణం ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా టిడిపి శ్రేణులకు వార్నింగ్ ఇవ్వడంతోనూ ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా కొందరు పార్టీ ముఖ్యులకి తాకేవిధంగా ఉండటమే. తలసాని ఎపి పర్యటన ఉదంతం టిడిపిని టార్గెట్ చేస్తూ ఉండటంతో పాటు ఆయన ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబుని కించపరిచేలా ఉండటం ఒక్కసారిగా ఎపి రాజకీయాలని వేడెక్కించిన సంగతి తెలిసిందే. అయితే తలసాని ఎపి పర్యటనకు ఎపి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న ఇద్దరు టిడిపి ముఖ్య నేతలే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినట్లు బైటకు తెలియడం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీలో ఇతర ముఖ్యనేతల ఆగ్రహానికి కారణమైంది.

ఆ ఇద్దరు నేతలు మరెవరో కాదు…ఒకరు టిడిపిలో అనధికారికంగా నంబర్ 2 గా భావించే యనమల రామకృష్ణుడు కాగా మరొకరు టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. వీరిద్దరూ తలసాని ఎపి పర్యటన సకల వైభోపేతంగా సాగేందుకు స్వయంగా పూనుకొని సకల ఏర్పాట్లు చేయించారని, సంక్రాతి వేడుకలతో పాటు సాక్షాత్తే శ్రీవారి సన్నిధిలోనూ సకల మర్యాదలు ఆయనకు లభించేలా అనుక్షణం శ్రద్ద తీసుకున్నారని వార్తలు రావడంతో ఈ విషయాలు తెలిసి కొందరు టిడిపి నేతలే ఆవేశంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో వారిలో కొందరు ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం…ఆ నేతల తీరు పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో చంద్రబాబు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారని, తలసాని ఎపి పర్యటన విషయంలో సహకరించిన టిడిపి ముఖ్యనేతల తీరు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైందని గుర్తించడం వల్లే వారిని పరోక్షంగా హెచ్చరిస్తూ ఘాటైన వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు చేసిన హెచ్చరికలు చూస్తే ఆ విషయం ఆర్థం అవుతుందని చెప్పుకుంటున్నారు.

ఇదంతా ఒకెత్తయితే తలసాని వ్యవహారంపై ఇంత రగడ జరిగినా, సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే స్పందించినా ఈ ఇద్దరు నేతలు ఇప్పటివరకు నోరు విప్పి ఒక్కమాట మాట్లాడక పోవడం సహచర టిడిపి నేతలనే కాదు ఆ పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. పార్టీ కంటే వీరికి తలసానితో అనుబంధమే ఎక్కువనేలా వీరి తీరు ఉందని చర్చించుకుంటున్నారు. కనీసం చంద్రబాబు హెచ్చరిక అనంతరమైనా వీరు తలసాని విషయమై స్పందించి ఉంటే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఇంత జరిగినా వీరిద్దరూ తలసాని విషయమై మాట్లాడకపోవటానికి కారణం తలసాని వీరిద్దరికి బంధువు కావడంతో పాటు ఆయనతో ముడిపడివున్న వ్యాపార,వాణిజ్య సంబంధబాంధవ్యాలే కారణమని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 స్థాయిలో ఉన్న యనమల రామకృష్ణుడికి హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు, వ్యాపార వ్యవహారాలను తలసాని శ్రీనివాసే చక్కబెడుతుంటారని…అందుకే ఆయన తలసానిని ఏమీ అనలేకపోతున్నారని…ఒక పుట్టా సుధాకర్ యాదవ్ కి తలసాని వియ్యంకుడు కావడం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నారేమోనని పార్టీ నేతలే చెవులుకొరుక్కుంటున్నారు. ఏదేమైనా తలసాని తాను ఏ లక్ష్యంతోనైతే ఈసారి ఎపి టూర్ కి విచ్చేశారో ఫలితం తాను కోరుకున్నదాని కంటే ఎక్కువగానే లభించినట్లు ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

Leave a Comment