(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపూర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బాలకృష్ణ హిందూపూర్లో పర్యటిస్తుండగా రహమతపురం సర్కిల్ వద్ద ఆయన వాహనాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిని వెంటనే పోలీసులు పక్కకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బాలకృష్ణకు మద్దతుగా టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.