ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేపాలి గ్యాంగ్ ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేపాలి గ్యాంగ్ ను అరెస్టు చేశారు అని స్పష్టం చేశారు. బోర్వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంటిలో పనిచేసే వాచ్ మెన్, వంట మనుషులను మచ్చిక చేసుకుని వాళ్లకు మత్తు మందు ఇచ్చి ఇంట్లో దోపిడీ చేశారని పేర్కొన్నారు. మధుసూదన్ రెడ్డి భార్య శైలజకు గ్రీన్ టీ ఆహారంలో వంట మనిషి ద్వారా ఈ నేపాలి గ్యాంగ్ మత్తుమందు ఇచ్చి… ఆమె మెడ పై ఉన్న బంగారం మరియు ఇంటిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు అని పేర్కొన్నారు.
ఈ గ్యాంగ్ ఫస్ట్ ఇంట్లో పని మనుషులుగా చేరి తర్వాత యజమానులకు నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత దోపిడీలకు ఈ నేపాలి గ్యాంగ్ పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కాస్త హైదరాబాదు వాసులు పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో దోపిడీలకు పాల్పడి పరారీలో ఉన్నావారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
పట్టుబడ్డ నిందితుల నుండి ఐదు లక్షల నగదు 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు… తెలియజేసిన సీపీ సజ్జనార్ మిగతా వారిని పట్టుకోవడానికి 10 టీమ్స్ విడిపోయి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, లక్నో వంటి రాష్ట్రాలకు వెళ్లి గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిని ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు పని మనుషులను నియమించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి విచారించి పెట్టుకోవాలని సూచించారు.