ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను కొనాలని చూసే వారిలో చాలా మంది తక్కువ ధర కలిగి ఉండి, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్ అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఫోన్లను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇక అలాంటి వారికోసమే టెక్నో కంపెనీ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ను విడుదల చేసింది. టెక్నో స్పార్క్ గో 2020 పేరిట విడుదలైన ఆ ఫోన్ ధర తక్కువ ఉండడమే కాదు.. అందులో ఆకట్టుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి.
టెక్నో స్పార్క్ గో 2020 ఫోన్లో.. 6.52 ఇంచుల డిస్ ప్లే ఉంది. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను కలిగి ఉంది. 1.8 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ను ఇందులో ఇచ్చారు. 2 జీబీ ర్యామ్ ఆప్షన్లో ఈ ఫోన్ లభిస్తుంది. 32 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉండగా, మెమొరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. వెనుక వైపు 13, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాలను ఇచ్చారు.
ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంటుంది. బ్లూటూత్ 4.2ను ఇచ్చారు. బ్యాటరీ 5000 ఎంఏహెచ్ కెపాసిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.6,499 మాత్రమే. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ సైట్లో ఈ ఫోన్ను కొనవచ్చు. సెప్టెంబర్ 7 నుంచి అమ్ముతారు.