KTR: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్. మంచి చేసినప్పటికీ సదరు పని విషయంలో ఆయన ఊహించని ఫలితం వచ్చింది. ఇదంతా హైదరాబాద్ లింగోజి గూడ కార్పొరేటర్ ఎన్నిక గురించి. గ్రేటర్ హైదరాబాద్ హహానగరం పరిధిలోని లింగోజి గూడ డివిజన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.
కీలక ఎన్నిక…
గత డిసెంబర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఖాళీ అయిన ఈ డివిజన్కు గత నెల 30వ తేదీన పోలింగ్ జరుగగా ఇవాళ ఓట్ల లెక్కింపు జరిగింది. గత డిసెంబర్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నా కాంగ్రెస్ తోపాటు మరికొందరు స్వతంత్రంగా నామినేషన్ వేసి పోటీకి దిగారు. అయినప్పటికీ తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థిపై 1272 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ నేత గెలుపొందారు.
ఇలా జరిగింది…
లింగోజిగూడలో మొత్తం 49 వేల 203 ఓట్లకు గాను 13 వేల 591 పోలయ్యాయి. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్న కోర్టు ఆదేశాలతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలైన 13 వేల 629 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 7 వేల 240 ఓట్లు రాగా బీజేపీ కి 5 వేల 968 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి 1272 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మానవతా దృక్పథంతో స్పందించాలని భావించి ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించకూడదని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.