Asaduddin Owaisi: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులకు మజ్లస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు మజ్లిస్ పార్టీలోకి రావాలని ఆయన సూచించారు. మజ్లిస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత గౌరవం లభిస్తుందని తెలిపారు.
దారుల్ సలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. మజ్లిస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి అని ఆయన ఆరోపించారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఒవైసీ ప్రశంసించారు.
పేదలకు మేలు చేసేదిగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని అన్నారు ఒవైసీ. తెలంగాణలో కేసిఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు టికెట్లు రాకపోవడంతో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు వేరే పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. మరో పక్క బీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు ఎక్కువ అయ్యాయి. ఒవైసీ పిలుపునకు ఎంత మంది కాంగ్రెస్ అసంతృప్తులు సానుకూలంగా స్పందించి ఎంఐఎంలో చేరతారో వేచి చూడాలి.
T Congress: అలూలేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.. సీఎం పదవిపై సీనియర్ల ఆశలు