దేవి తన తండ్రి తన తండ్రికి సేవలు చేస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య రుక్మిణి నీ ఆ ఇంటి తలుపులు తెరుస్తారు.. అతన్ని ఆదిత్య చడమడ వాయిస్తాడు.. పట పటమని చంప దెబ్బలు కొడతాడు. ఏమైంది ఎందుకు కొడుతున్నారు అని అతను అడుగుతాడు. నేను దేవికి తండ్రినని చెబుతాడు. నిజం చెప్పరా దేవికి ఈ అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావని ఆదిత్య అడుగుతాడు..
అతనిని చాలాసేపు కొట్టిన తర్వాత నిజం చెబుతానని అంటాడు. కానీ మనసులో మాధవ్ పేరు చెబితే నన్ను చంపేస్తాడు. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటాడు. ఈ పాపకు తండ్రి ఎవరూ లేరని తెలుసుకుని డబ్బులు ఉన్నోళ్ళని తెలుసుకొని ఎంతోకొంత డబ్బులిస్తారని ఇదంతా చేశాను అని చెబుతాడు. నిజం చెప్పమని మరోసారి నాలుగు కొడతాడు. ఆదిత్య నిజం చెప్పమని అతని ను కొట్టగానే అదే నిజం సార్ ఒట్టు అని అంటాడు.. అప్పుడే దేవి రాదను తన తండ్రి ఎవరో చెప్పమని నిలదీస్తుంది ఆదిత్య నేనే నీ తండ్రి అని చెప్పేందుకు దేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.. దేవిని ఇంటికి తీసుకు వెళ్ళమని రాధ తో ఆదిత్య చెబుతాడు..
ఆదిత్య ఇంటికి రాగానే దేవుడమ్మ దేవి ఎలా ఉంది అని అడుగుతుంది.. నువ్వేమీ కంగారు పడకు అమ్మ అనవసరంగా వాళ్ళు నీకు ఈ విషయం చెప్పి కంగారు పెట్టినట్టున్నారు. దేవి బానే ఉంది. ఇప్పుడే ఇంటికి వెళ్లిపోయింది. జాగ్రత్తగానే ఉంది నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు అని ఆదిత్యా అంటాడు.. దేవుడమ్మ వెంటనే మాధవ్, రాధ ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా ఉన్నారు అని అంటుంది..