ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొమ్మిది రాష్ర్టాలలోని 72లోక్ సభ స్ధానాలలో నాల్గవ దశ పోలింగ్ నేడు(సోమవారం) ప్రారంభం అయ్యింది.
ఒరిస్సాలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
బీహార్లో ఐదు, జార్ఖండ్ మూడు, మధ్యప్రదేశ్ ఆరు, మహారాష్ట్ర17, ఒరిస్సాఆరు, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ ఎనిమిది, రాజస్థాన్ 13, జమ్మూ కశ్మీర్ ఒక లోక్ సభ స్ధానాలకు ఈ విడతలో పోలింగ్ ప్రారంభం అయ్యింది.
జమ్మూ కశ్మీర్లో సమస్యాత్మక అనంత్నాగ్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో జరుగుతోంది.
అందులో మూడో దశలో అనంత్నాగ్(మొదటి దశ)లో జరిగింది. నేడు జరిగే నాల్గో దశలో కుల్గామ్(రెండో దశ)లో పోలింగ్ జరుగుతున్నది.
అలాగే మిగతా ప్రాంతాల్లో ఐదో దశ (మే 6)లో పోలింగ్ జరగనున్నది. 72 స్థానాల్లో 14 ఎస్సీ, తొమ్మిది ఎస్టీ, 49 జనరల్ కేటగిరి స్థానాలున్నాయి.
ఈ దశలో 12,79,58,477 మంది ఓటర్లు కాగా, అందులో పురుషులు 6,73,22,777, మహిళలు 6,06,31,574, థర్డ్ జండర్స్ 4,126 ఓటర్లు ఉన్నారు. నాల్గవ విడత పోలింగ్లో 961 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
1,40,849 కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది.