న్యూఢిల్లీ: భారత వాయిసేనకు చెందిన విమానం గల్లంతు అయ్యింది. ఈ విమానంలో ఎనిమిది మంది సిబ్బందితో పాటు అయిదుగురు ప్రయాణీకులు ఉన్నారు.
జోర్హాట్ నుండి మధ్యాహ్నం 12.25గంటలకు బయలుదేరిన ఈ ఏఎన్ -32 ఎయిర్ క్రాఫ్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని మేచుకాకు వెళ్లాల్సి ఉండగా ఒంటి గంట సమయంలో గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకి కోసం ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.