బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యదియూరప్ప తన మంత్రివర్గంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. వారిలో ఒకరు గతంలో అసెంబ్లీలో బూతు వీడియో చూస్తూ పట్టుబడిన లక్ష్మణ్ సవాడీ. ఈ నియామకం బిజెపిలోనే అలజడి కలిగించింది.
2012లో మంత్రిగా ఉన్న సవాడీ,మరో ఇద్దరు మంత్రులు సిసి పాటిల్, కృష్ణ పలేమార్ అసెంబ్లీలో మొబైల్లో బూతు వీడియో క్లిప్పింగ్ చూస్తూ కెమెరాలకు దొరికిపోయారు. రేవ్ పార్టీలు ఎలా జరుగుతాయో తెలుసుకునేందుకు చూశామని తర్వాత వారు సర్దేందుకు ప్రయత్నించారు. తీవ్రమైన ఇబ్బందికి గురయిన బిజెపి అధిష్టానం ఆ ముగ్గురితో రాజీనామా చేయించింది.
ప్రస్తుతం సవాడీ శాసనసభ్యుడి కాదు. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ సభ్యుడు రమేష్ జర్కిహోళికి సవాడీ సన్నిహత మిత్రుడు. తన మిత్రుడిని ఇటు లాగినందుకు కృతజ్ఞతగా సవాడీకి ఉమ ముఖ్యమంత్రి పదవి అప్పగించారని భావిస్తున్నారు. ఈ నియామకం కొందరు సీనియర్ బిజెపి సభ్యులకు రుచించలేదు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేణుకాచార్య బహిరంగంగానే తన అసంతృప్తి వెలిబుచ్చారు.