త్వరలో కరోనాపై ఏ ఆర్డినెన్సో, ఏ రద్దు ఫైలో వస్తుందేమో… వేచి చూడండి…! అంతేగా, జగన్ కి ఏది అడ్డు వచ్చినా లేపి పారేయాల్సిందే. మండలి, ఆ నర్సీపట్నం డాక్టరు, ఆ నగరి మున్సిపల్ కమిషనర్, ఈ కమ్మగడ్డ రమేష్ కి పట్టిన గతే ఆ కరోనాకు పడుతుంది లే…! ఆర్డినెన్స్, జీవో వచ్చినా ఆశ్చర్యం వద్దు…!!? సరే ఇక అసలు విషయంలోకి వెళదాం పదండి…!!
నిన్నటికి నిన్న నిమ్మగడ్డ రమేష్ మాజీ అయిపోయారు. ఎన్నికల కమిషనర్ గా ఆయనని తొలగించేసింది ప్రభుత్వం…! ఇవాళ ఉదయానికి ఆ చెన్నైకి చెందిన కనగరాజ్ వచ్చి మన ఎన్నికల కమిషనర్ గా చేరిపోయారు. ఈయనను జగన్ ఏరికోరి తెచ్చుకున్నారా? వైసీపీ కి అనుకూలమా? అసలు జగన్ కి ఈయన ఎలా తెలుసు అనేది తర్వాత చెప్పకుందాం…! ఇప్పుడు తక్షణమే తెలుసుకోవాల్సిందే ఏమిటంటే నిమ్మగడ్డ ఏం చేయనున్నారు? కోర్టులకు వెళ్తే ఆయనకు ఎటువంటి దారులు కనిపించనున్నాయి? అనేది చర్చనీయాంశం.
దారులేమిటి? వాదనలేమిటి?
ఇప్పుడు కోర్టులోకి బంతి వెళ్తే… ఇటు నిమ్మగడ్డకు, అటు ప్రభుత్వానికి సమ అవకాశాలున్నాయి. ఈ రోజు, రేపు కోర్టులు సెలవు ఉండడంతో మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. వేస్తే వేసుకోనీ…, అక్కడ చర్చకు వచ్చే అంశాలే ముఖ్యం.
- ఎన్నికల కమిషనర్ ని తిలగించడం కేంద్రం పరిధిలో అంశం. కేవలం ఒక ఆర్డినెన్స్ తెచ్చేస్తే తొలగింపు, పదవికాలం తగ్గింపు కుదరదు. వెంటనే దీనిపై స్టే ఇవ్వాలి. అని నిమ్మగడ్డ కోరతారు. (దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 243(కె) ద్వారా తమకు ఉన్న “విచక్షణ అధికారాలను గుర్తు చేసే వీలుంది. తాము నిమ్మగడ్డని తొలగించలేదని.., పదవీకాలం తగ్గించామని… ఆయన పదవీకాలం ముగిసినందున ఆయనను తొలగించాల్సి వచ్చిందని సమాధానం చెప్పుకుంటుంది.)
- తన తొలగింపు రాజకీయం అంశంతో ముడిపడి ఉందని, ప్రభుత్వం తనపై కక్షకట్టి తిలగించిందని, ఇలాగే జరిగితే రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల కమిషన్ కి విలువ ఉండదని నిమ్మగడ్డ వాదించే వీలుంది, దానికి బలంగా సీఎం జగన్ చేసిన ఆరోపణలు లేవనెత్తుతారు. (దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ గతంలో ఎన్నికల వాయిదా వేసిన తీరుని, తమను సంప్రదించలేదని, ఆయన రాజకీయంగా ఓ కులం, ఓ పార్టీకి అనుకూలంగా ఉన్నారని వాదించే వీలుంది))
- ఇక చివరగా స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఒక కమీషనర్ ని మార్చడం సబబు కాదు. ఎన్నికలను వాయిదా వేశాము, పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఇష్టం. ఎన్నికల ప్రక్రియ మధ్యలో మార్పులు జరిగితే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం పడుతుంది అంటూ నిమ్మగడ్డ లెవనెత్తె వీలుంది.., ఒకవేళా ఆయన తరపున టీడీపీ అండ్ కో అయిన ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. (దీనికి మాత్రం కాస్త కోర్టు కరిగే వీలుంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఎన్నికల్లో రమేష్ అధికార దుర్వినియోగం అంటూ వాదనలు వినిపిస్తుంది)..! ఇలా భిన్న అంశాల్లో భిన్న వాదనలు వస్తాయి. బలమైన, తెలివైన లాయర్ ఉంటే కోర్టుని కరిగిస్తే తీర్పు ఏమైనా రావచ్చు.
జగన్ చక్రం ఇక్కడ కీలకం…!
ఎన్నికల కమిషనర్ మార్పులో జగన్ ఎంత కీలకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారో కోర్టులో కూడా జగన్ అంతే వ్యూహంతో ఉండాలి. ఇప్పటికె కోర్టులో జగన్ కు చాలా విషయాల్లో తలనొప్పులు ఎదురయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఉంటున్నాయి. అవన్నీ ఒక ఎత్తు, ఈ అంశం ఒక ఎత్తు. అందుకే ఇదివరకటిలా కాకుండా కోర్టు వాదనల్లో తమకు ఎదురయ్యే సవాళ్లు, దానికి సమాధానాలు సిద్ధం చేసుకుని దిగితే మంచిది, లేకుంటే నిమ్నగడ్డ చాకచక్యంగా తన కుర్చీలోకి మళ్ళీ ఎక్కేసే వీలుంది. ఆయనకు లీగల్ పాయింట్లు ఉన్నాయి, వెనుక చంద్రబాబు వంటి బుర్ర ఉంది. అందుకే చూద్దాం. కోర్టులో ఈ ఎన్నికల రాజకీయ “చలన”చిత్రం ఎలా నడుస్తుందో…!
- శ్రీనివాస్ మానెం