హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్కు చెందిన ఎర్రవల్లి ఫామ్హౌస్లో విధి నిర్వహణలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఏ వెంకటేశం అనే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం ఉదయం గన్తో కాల్చుకున్నాడు. అతన్ని సహచర సిబ్బంది పోలీస్ వాహనంలో హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.
నల్లగొండ జిల్లా చాడ గ్రామానికి చెందిన వెంకటేశం మద్యంకు బానిస అయి చాలా రోజులు సెలవులో ఉన్నాడు. మద్యం మానడానికి హైదరాబాదులోని ఎడిక్షన్ సెంటర్లో చికిత్స కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 29వ తేదీన డ్యూటీలో జాయిన్ అయిన వెంకటేశం మద్యం మానలేక సెలవుపై వెళ్లిపోయాడు. వెంకటేశం భార్య విజ్ఞప్తి మేరకు ఆర్ఐ సింహాచలం మంగళవారం (15వ తేదీ) అతన్ని విధుల్లోకి తీసుకున్నారు. తిరిగి విధుల్లోకి చేరిన మరుసటి రోజే గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.