ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో తగ్గుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 400 పైగా కేసులు నమోదైతే, తెలంగాణలో మాత్రం 200 లోపే ఉన్నాయి. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఈ వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడం.., తెలంగాణలో దాదాపు తగ్గుముఖం పట్టడం మాత్రం కాదు. లోతుగా వెళితే కేసులు తూకం ఎక్కడ తప్పుతోంది అనేది సూటిగా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ర్యాపిడ్ ఇట్లు వచ్చినప్పటినుంచి టెస్ట్ లు విపరీతంగా పెరిగాయి. గతంలో రోజుకి 2000, 3000 టెస్టులు మాత్రమే జరిగేవి. ప్రస్తుతం రోజుకి 6500 పైగా టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫలితంగానే పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇది సహజమే. ఇదే సమయంలో తెలంగాణలో గడిచిన వారం రోజుల్లో చేసిన సంఖ్య బాగా తక్కువ అందుకే రెండు రాష్ట్రాల్లో ఈ తేడా.
తెలంగాణలో ఎందుకిలా??
ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద 70 వేల పరీక్షలు చేస్తే వాటిలో 1177 పాజిటివ్ వచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు 14 వేల పరీక్షలు మాత్రమే చేశారు. వీటిలో వెయ్యి పాజిటివ్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ పాజిటివ్ 1.8 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం ఇది 7 శాతం నమోదు అవుతున్నాయి. ఇది తెలంగాణలో ఆందోళన కలిగించే విషయం. అక్కడ టెస్ట్ లు చేయకపోవడం వల్లనే సంఖ్య బాగా తగ్గించడం జరుగుతుంది. కానీ కరోనా లేదు అనే ప్రచారం చేయడం ఆందోళన కలిగించే విషయం. నిజానికి వారం రోజుల కిందటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరోపణలు ఎదుర్కొంటోంది. నియంత్రణలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా పని చేస్తున్నారని పదే పదే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇక్కడ ఎమ్మెల్యేలు వ్యవహారం…!
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులకు రాజకీయాలను ముడి పెట్టడం కూడా ఈ సమయంలో ఎక్కువగానే ఉంది. అంటే ఇక్కడ అ ఏ పార్టీ అతీతం కాదు. కరోనా వ్యవహారం ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధికారపక్షం తమ లబ్ధికి ఆలోచించడం, ప్రయత్నాలు చేయడం సబబు. దురదృష్టవశాత్తు ఆపత్కాల, విపత్తుల సమయంలో కూడా రాజకీయాలు, ఎన్నికలు అనేవి ఆలోచించకుండా పనిచేసే పార్టీ నాయకులు ప్రస్తుతం లేరు. అందుకే ఈ విమర్శలు. ఇదే సమయంలో అధికార పక్షంలో ఎమ్మెల్యేలు విపరీత ప్రచారం, హడావుడి, హంగామా, భజన చేస్తుండడం ప్రభుత్వాన్ని ఒత్తిడి పడుతుంది. పెరిగిన కేసులు ఆటోమేటిక్ గా పెరిగినప్పటికీ అధికారపక్షం ఎమ్మెల్యే లే కారణం అనే విమర్శలు వస్తున్నాయి. దీనికి ఆ అధికార పక్షం సమాధానాలు కూడా సరిగా లేవు. అందుకే రాష్ట్రంలో సామాన్య జనానికి చికాకు పుట్టించే పరిస్థితి నెలకొంది.