Chiranjeevi: రాజకీయాల్లోకి రాకముందు మెగాస్టార్ చిరంజీవి పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం జరిగింది. థమ్సప్ లాంటి కూల్ డ్రింక్ కంపెనీలకు ఇంకా నవరత్న ఆయిల్… వంటి టాప్ మోస్ట్ కంపెనీలకు చిరంజీవి అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2009 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో… “ప్రజారాజ్యం” పార్టీని స్థాపించి పోటీకి దిగి ఆశించిన రీతిలో రాజకీయాల్లోకి రాణించలేకపోయారు. అదేసమయంలో సినిమాలకు దూరం కావడంతో… అంబాసిడర్ గా ఉన్న పలు కంపెనీలు చిరంజీవి ని పక్కన పెట్టి… మరొక హీరో ల చేత యాడ్ షూటింగ్ చేయించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే మళ్ళీ కొద్ది సంవత్సరాల క్రితం నుండి.. సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చిరంజీవి “ఆచార్య” అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా… ఓ ప్రముఖ కంపెనీ కి ఓకే చెప్పినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అది పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అని… దానికి చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్..గా వ్యవహరించడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్. త్వరలోనే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి యాడ్ షూటింగ్ లో… చిరంజీవి పాల్గొననున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి ఇటీవలే కరోనా నుండి కోలుకోడంతో… ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “ఆచార్య”సినిమా ఏప్రిల్ నెలలో వేసవి కానుకగా.. వస్తున్న నేపథ్యంలో మెగాఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా సినిమాల్లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలక పాత్ర చేస్తూ ఉండటం.. తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.