దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వల్ల మనుషులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తాజాగా కరోనా మహమ్మారి గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 5 ప్రత్యేక మార్గాల ద్వారా ఎక్కువగా ఈ వైరస్ సోకుతున్నట్టు తేలింది. కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా ఈ విషయాలను వెల్లడించింది. 70 శాతం మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా సోకలేదు.
అయితే మైనారిటీ కేసులే వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. శాస్త్రవేత్తలు ప్రయాణాలు చేసేవారు, చిన్నపిల్లలు వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ కలిసి వాష్టింగ్టన్ కేంద్రంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన కేసులను పరిశీలించి సైన్స్ మ్యాగజైన్లో ఫలితాలను పొందుపరిచారు.
ఈ అధ్యనంలో పాల్గొన్న రమణన్ లక్ష్మీనారాయణన్ సూపర్ స్ప్రెడర్ల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది… సాధారణ వ్యక్తుల కంటే సూపర్ స్ప్రెడర్లే వైరస్ వ్యాప్తికి ఎక్కువగా కారణం అవుతున్నాయని వెల్లడించారు. ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తే మాత్రమే ఎక్కువ ముప్పు అని చెప్పారు. ప్రయాణ సమయంలో ఇతరులతో కలవకపోవడమే మంచిదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
20 ఏళ్ల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. 14 సంవత్సరాల కంటే వయస్సు తక్కువగా ఉన్నవాళ్లు వైరస్ వ్యాప్తికి ఎక్కువగా కారణమవుతున్నారని.. దేశంలో వృద్ధుల మరణాలు కూడా తక్కువగానే ఉన్నారని తెలిపారు. చనిపోయే ముందు వ్యక్తి పరీక్షకు, మరణానికి మధ్య చాలా తక్కువ రోజుల గ్యాప్ ఉందని చెప్పింది.