Texas Shooting: అమెరికా టెక్సాస్ నగరంలో ఓ ఎలిమెంటరీ స్కూల్ లో విద్యార్ధులపై 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ దారుణమైన సంఘటనలో 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం జరిగింది. ఏకంగా ఆగంతకుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి పాఠశాలలో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒక్కసారిగా పాఠశాలలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చే లోపే కాల్పులు జరపడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి సాల్వడార్ రామోస్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గతంలో ఓ హత్యానేరంలో ఇతడు అనుమానితుడిగా ఉన్నట్లు ఈ క్రమంలో అతనీ.. పోలీసులు పట్టుకునే క్రమంలో చేజింగ్ చేస్తుండగా అతడు తన ట్రాకు నుండి దిగి రాబ్ ఎలిమెంటరీ పాఠశాల లోకి ప్రవేశించి పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అక్కడి గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలియజేశారు. మొత్తం 21 మంది పై కాల్పులు జరిపితే అందులో ఇద్దరు కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అని స్పష్టం చేశారు. చనిపోయిన పిల్లల్లో ఎక్కువ మంది నాలుగు 4 నుండి 11 సంవత్సరాల వయస్సు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు భారీగా చేరుకుని ఘటనకు పాల్పడిన సాల్వడార్ రామోస్ అనే వ్యక్తిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. జరిగిన ఈ దుర్ఘటన పట్ల అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరిస్ స్పందించారు. ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రతి సారి మా గుండెలు బద్దలయ్యాయి అని చెప్పటం సహజం. కానీ ఇటీవల నిత్యం అమెరికాలో కాల్పులు జరుగుతూ ఉండటంతో అమెరికన్ల గుండెలు పదేపదే బద్దలై పోతున్నాయి. ఈ తరుణంలో ఇకనైనా ధైర్యం చేసుకుని వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచన చేయాలి అని కమల హరిస్ స్పష్టం చేశారు.