Diabetes: డయాబెటిస్.. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.. ఇది సైలెంట్ కిల్లర్.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి.. డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే మూత్రపిండాలతో సహా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి..!! డయాబెటిక్ ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..!!
మధుమేహం ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. అందుకు తగిన విధంగా వారు డైట్ ప్లాన్ చేసుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్ సైజులు, వ్యాయామం చేయాలి. ఇంకా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు పనితీరు పై ప్రభావం చూపుతుంది.
మధుమేహం ఉన్న వృద్ధులలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ ఉన్న వారిలో 46 శాతం మందికి కిడ్నీ వ్యాధులు ఉన్నట్లు పలు ఆసుపత్రుల నివేదికలో తేలింది. దీర్ఘకాలికంగా ఈ సమస్య బయట పడుతున్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్ వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధులు రాకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో తప్పకుండా డయాబెటిస్ కిడ్నీల పనితీరు పై ప్రభావం చూపుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.