Corona Dog’s: మహమ్మారి కరోనా ప్రపంచంలో ప్రతి మనిషిని కదిలించివేసింది. 2019 నవంబర్ నెలలో చైనా లో బయటపడ్డ ఈ వైరస్.. ప్రపంచ స్థితిగతులను మాత్రమే కాదు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను మనిషి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్ దాటికి.. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. విద్యా వ్యవస్థ వ్యాపార రంగం… అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. కరోనా వైరస్ అరికట్టడానికి చాలా దేశాలలో వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినా కానీ కొత్త వేరియంట్ లు పుట్టు కోస్తూ… పరిపాలకులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం చైనా, ఉత్తర కొరియా మరికొన్ని దేశాలలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. మన దేశంలో ఇప్పటికే మూడు వేవ్ లు రావడం తెలిసిందే. రెండో వేవ్ లో అత్యధిక ప్రాణ నష్టం జరుగగా..మూడో వేవ్ లో ఎక్కువ కేసులు వచ్చాయి. కానీ ప్రాణాపాయం పెద్దగా లేదు. ప్రస్తుతం దేశంలో కేసులు గత మర్చి నుండి తగ్గటం..సాధారణ పరిస్థితులు రావడం జరిగింది. ఇదిలా ఉంటే కరోనా రోగులను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయ్. మన దేశంలో అయితే ఆర్టిపిసిఆర్, రాపిడ్ పరీక్షలు ద్వారా నిర్ధారిస్తారు. కానీ తాజాగా ఇటీవల ఫిన్ లాండ్ దేశ వైద్య పరిశోధకులు కొన్ని జాగిలాలకు కరోనా వైరస్ గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు.
ఈ క్రమంలో 420 మంది స్కీన్ స్వాబ్ శాంపిల్స్ వాటి ముందు ఉంచగా… 114 మందికి కరోనా సోకినట్లు గుర్తించడం జరిగింది. మిగిలిన శాంపిల్స్ కి పరిశోధకులు టెస్ట్ నిర్వహిస్తే నెగిటివ్ వచ్చింది. దీంతో ఈ జాగిలాలు విమానాశ్రయాల్లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో 98 శాతం కచ్చితత్వంతో వైరస్ సోకిన వ్యక్తులను ఈ కుక్కలు గుర్తించాయి. వైరస్ ఎక్కువగా విమాన ప్రయాణికులు ద్వారా .. అంతర్జాతీయ ప్రయాణీకుల ద్వారా సోకే పరిస్థితి ఉండటంతో ఫిన్ లాండ్ ప్రభుత్వం .. కరోనా వైరస్ రోగులను గుర్తించే ఈ జాగిలాలను.. విమానాశ్రయాల్లో ఉంచుతుంది.