Eatela rajendar: టీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత పరిణామాలను గమనిస్తున్న నేతలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటుగా మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరారు. ఇక, త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు ఈటలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ సమయంలోనే కొత్త చర్చ జరుగుతోంది.
Read More: Eatela Rajendar: ఈటల ఎపిసోడ్తో ఇరుకున పడిపోయిన రఘురామరాజు
ఈటలపై వారంతా…..
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరడంపై ఆ పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పలు కామన్ పాయింట్ల ఆధారంగా ఈటలపై విరుచుకుపడుతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కానే కాదు కేవలం ఆయన అస్తిత్వ పోరాటమే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈటలది ఆస్తుల ఆరాటం తప్ప మరేమి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి, మంత్రి పదవులు కేసీఆర్ చలవేనని చెప్తున్నారు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయి కి ఈటలను తీసుకెళ్లింది కేసీఆర్ కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లడ్ల క్రితమే ఈటెల బీజేపీ లో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు అంటూ సంచలన ఆరోపనలు చేస్తున్నారు. బీజేపీ లో చేరినందుకు రాజేందర్ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు.
Read More: Eatela Rajendar: ఈటల టీఆర్ఎస్లోనే ఉంటే ఏం జరిగేదో తెలుసా…. ఆ ఒక్కడూ ఆయనేనట!
టీఆర్ఎస్లో ఉండాలంటే…
మొత్తంగా టీఆర్ఎస్ పార్టీలో లైమ్ లైట్ లో ఉండాలంటే… మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వరిఉచుకు పడాలి అన్నట్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరిస్తున్నారని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఈటల గురించి ఎంత సంచలన కామెంట్లు చేస్తే పార్టీ పెద్దల దృష్టిలో అంతగా పడతాం అన్నట్లుగా కొందరు నేతల తీరు ఉన్న్లట్లుంద అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.