Bigg Boss Non Stop: బిగ్బాస్ ఓటీటీ శనివారం ప్రారంభమైంది. దాదాపు ఎనభై నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించే రీతిలో షో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ టైం ఓటిటి లో ప్రసారం కానున్న తరుణంలో .. బిగ్ బాస్ ఆడియాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ ఒకటి ముగిసిన తరువాత మరొక సీజన్ స్టార్ట్ చేయటానికి దాదాపు తొమ్మిది నెలలు టైం తీసుకుంటారు. కానీ సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే… రెండు నెలల గ్యాప్ లోనే బిగ్బాస్ ఓటీటీ ప్రారంభించడం అందరికీ షాక్ కు గురిచేసింది.
సమ్మర్ ని టార్గెట్ చేసుకుని బిగ్బాస్ ఓటీటీ ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించాలని.. షో నిర్వాహకులు డిసైడ్ అయ్యి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని టాక్. ఇదిలా ఉంటే శనివారం ప్రారంభమైన ఈ రియాల్టీ షోలో మొదటి రోజు 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో తొమ్మిది మంది అమ్మాయిలు కాగా ఎనిమిది మంది అబ్బాయిలు. ఇదే సమయంలో గతంలో బిగ్ బాస్ పలు సీజన్ లో ఆడిన వాళ్ళు కూడా ఎంట్రీ ఇవ్వటం విశేషం.
వాళ్ల లిస్టు చూస్తే ఈ విధంగా ఉంది. సీజన్ ఫైవ్ లో ఆడిన సరియు, హమీదా, నటరాజ్ మాస్టర్ రావడం జరిగింది. ఇక సీజన్ త్రీలో మహేష్ విట్టా, సీజన్ ఫోర్ కి వచ్చేసరికి.. రన్నర్ అఖిల్, అరియణా, ఆషు రెడ్డి రావడం జరిగింది. ఇదే సమయం లో సీజన్ వన్ లో వచ్చిన ముమైత్ ఖాన్ కూడా మరోసారి బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఎనిమిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు … మరోసారి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి 24 గంటల ఎపిసోడ్ చూపిస్తూ ఉండటంతో.. ఏ రీతిగా వీళ్ళు గేమ్ ఆడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.