అలనాటి మహానటి సావిత్రి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అందరితో శభాష్ అనిపించుకోవడమే కాదు.. జాతీయ ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మిస్ ఇండియా’ . ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తెలుగు చిత్రమిదే. రీసెంట్గా యూరప్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ టీజర్ను, మేకింగ్ వీడియోను కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.