హైదరాబాద్: గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్పై పోలీసులు దాడి చేసి గాయపరిచారన్న మాట కట్టుకథేనని తేలిపోయింది. రాజాసింగ్ తన తలపై తానే గాయం చేసుకొని పోలీసులను నిందించాడని స్పష్టం చేసే ఒక వీడియో బయటపడింది.
బుధవారం రాత్రి రాజాసింగ్ పెద్ద సంఖ్యలో తన అనుచరులను వెంటపెట్టుకుని జుమ్మేరాత్ బజార్ నుంచి స్వాతంత్ర్య సమర యోధురాలు రాణి అవంతీబాయ్ విగ్రహాన్ని గోషామహల్ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అందుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దానితో ఆ గందరగోళంలో రాజాసింగ్ ఒక పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టుకున్నారు. పోలీసులు కొట్టిన కారణంగా తలపై గాయాలు అయ్యాయని ఆరోపించారు.
నిజానికి జరిగింది అది కాదని చెబుతూ వెస్ట్ జోన్ డిసిపి ఎ.ఆర్. శ్రీనివాస్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. రాజాసింగ్ పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనీ, పరుష పదజాలంతో దూషించారనీ ఆయన చెప్పారు.
MLA Raja singh hit himself with a stone on his head and caused a self inflicted injury on his head and is falsely alleging that police has caused this injury.
DCP West Zone pic.twitter.com/jZv4bUK79A— A R SRINIVAS IPS (@DCPWZHyd) June 20, 2019