(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రెండు రోజులుగా కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి.పట్టణాలు, గ్రామాల్లో నివాస ప్రాంతాల మధ్యకు వర్షపు నీరు భారీగా చేరి చెరువులను తలపిస్తున్నాయి.
నంద్యాల పట్టణం లోని కరెంట్ ఆఫీస్ రోడ్డులో నిలిచిన వర్షపు నీటిలోకి పెద్ద మొసలి వచ్చింది. నీళ్ల లోకి దిగిన వ్యక్తులను మింగేందుకు మొసలి వెంటపడుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఆప్రాంతం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది.