(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఒకరు లైవ్ టివి షోలో ఒక జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
ఒక టివి న్యూస్ ఛానల్లో పాకిస్తాన్ అధికారపక్షం అయిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మస్రూర్ ఆలీ సియాల్ ప్యానలిస్టుగా కూర్చున్నారు. పక్కనే జర్నలిస్టు ఇంతియాజ్ ఖాన్ ఫరాన్ మరో ప్యానలిస్టుగా కూర్చున్నారు. వీడియోలో ఇద్దరూ మొదట వాదించుకోవడం కనబడుతుంది. తర్వాత సియాల్ లేచి ఖాన్ను తోశారు, కొట్టడం ప్రారంభించారు. ఇంతలో సహ ప్యానలిస్టులు, ఛానల్ సిబ్బంది వచ్చి వారిని విడదీశారు.
విచిత్రం ఏమంటే ఈ గొడవ తర్వాత సియాల్ మళ్లీ తన స్థానంలో కూర్చుని చర్చలో పాల్గొన్నారు. తర్వాత కరాచీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూడా వచ్చి చర్చలో పాల్గొన్నారు. ఏమీ జరగనట్లే చర్చ కొనసాగింది. ట్విట్టర్లో దీనిపై విపరీతమైన స్పందన వచ్చింది. సియాల్ ప్రవర్తనను చాలామంది తీవ్రంగా నిరసించారు. అయితే కొంతమంది ఇందులో కూడా హాస్యం పండించారు. ఒక ట్విట్టర్ ఖాతాదారుడు ఫైటింగ్పై కెమేరా పోకస్ చేయనందుకు కెమేరామ్యాన్ను తప్పు పట్టాడు.
Is this Naya Pakistan? PTI's Masroor Ali Siyal attacks president Karachi press club Imtiaz Khan on live news show. pic.twitter.com/J0wPOlqJTt
— Naila Inayat (@nailainayat) June 24, 2019