న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ చేతిలో ఉంది కదాని ఏది దొరికితే అది పోస్ట్ చేసేస్తుంటారు. ఇలాగే ఆయన పోస్ట్ చేసిన ఒక చిత్రం వివాదానికి దారితీసింది. నెటిజన్లు దానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ వ్యక్తి చీపురు పట్టుకుని స్వస్తిక్ గుర్తును తరుముతున్నట్లుగా అందులో ఉంటుంది. తనకు ఎవరో ఇది పంపారని ఆయన షేర్ చేశారు. ‘‘నేను ఉండటానికి, చూడలానికి ఇబ్బంది పడని ఢిల్లీ రావాలని ఆశిస్తున్నా’’ అని దాని మీద ఉంది. చీపురుకట్ట ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు.
ముందుగా ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఈ ట్వీట్ చూసి మండిపడ్డారు. హిందూ మతాన్ని కేజ్రీవాల్ దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందువులు ప్రశాంతంగా జీవిస్తారని.. ప్రచారం, ప్రసారాలలో వారికి నమ్మకం లేదని అన్నారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లు మాత్రం ఓట్ల యావలో హిందువులు, హిదూ మతాన్ని దూషిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కేజ్రీవాల్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణంగా తిరగేసిన స్వస్తిక్ అయితే జర్మనీ మాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన నాజీల గుర్తు. అదే మామూలుగా ఉండే స్వస్తిక్ అయితే భారత ఆధ్యాత్మిక గుర్తు. హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు కూడా దాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. స్వస్తిక్ అంటే సంస్కృతంలో బాగుండటం, మంచి అదృష్టం అనే అర్థముంది. పలు అంతర్జాతీయ అవార్డులు పొందిన పుస్తక రచయిత హిందోల్ సేన్ గుప్తా కూడా కేజ్రీవాల్ ను తిట్టిపోశారు. ‘‘డియర్ కేజ్రీవాల్, ఇది చాలా అసహ్యంగా ఉంది. స్వస్తిక్ అనేది హిందూ, బౌద్ధ, జైన మతాలకు చాలా పవిత్రమైన గుర్తు. నాజీలు దీన్ని దొంగిలించి, రూపం మార్చారు. ఇది అతి పెద్ద సాంస్కృతిక భ్రష్టత్వం. ఇప్పుడు మీరూ అదే చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ కు ఏకంగా 9వేల కామెంట్లు వచ్చాయి.
‘‘స్వస్తిక్ అనేది హిందువుల పవిత్ర గుర్తు (బౌద్ధులు, జైనులకు కూడా) ఇది సూర్యుడు, సంపదను సూచిస్తుంది. ఇలాంటి హిందూఫోబియా ఉన్న కార్టూన్ ను ఖండించాల్సింది పోయి, మీరు దాన్ని షేర్ చేస్తున్నారు. హిందువులను చీపురుకట్టలతో తుడిచి బయట పారేసే ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటోందా? ఈ తరహా విద్వేష రాజకీయాలను భారతదేశం తిరస్కరించాలి’’ అని మరో యూజర్ అన్నారు. ‘‘ఇప్పుడు మన పవిత్ర గుర్తులను మీరు అవమానించడం మొదలుపెట్టారా? స్వస్తిక్ అనేది ఏ రాజకీయ పార్టీకీ సంబంధించినది కాదే’’ అని ఇంకొకరు తిట్టారు.
అయితే, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ మాత్రం కేజ్రీవాల్ ట్వీట్ ను నాజీల గుర్తుకు సంబంధించినదని చెప్పేందుకు ప్రయత్నించారు. ‘‘చీపురుకట్టతో కొడితే వచ్చే బాధేంటో హిట్లర్ మద్దతుదారులలో కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. కేజ్రీవాల్ మరో పోస్టులో అడాల్ఫ్ హిట్లర్ ను ప్రస్తావించారు. ‘‘చరిత్ర నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం’’ అని ఆయన అన్నారు. అతడికి వ్యతిరేకంగా ఏకం కావాలని మేధావులు ఇచ్చిన పిలుపును ప్రజలు పట్టించుకోకపోవడం వల్లే 1932లో గెలిచారని చెప్పారు. పరోక్షంగా ఆయన మోదీని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతుండటాన్ని చెప్పారు.
Someone sent this … pic.twitter.com/IScYDLgwZr
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2019
This is the power of Hindutva.
We Hindus live peacefully. We have never believed in Prachar or Prasaar.
It hurts to see power hungry @ArvindKejriwal berating Hindus nd Hinduism when it suits his vote calculations.#ShameOnKejriwal@CeodelhiOffice should take strict action https://t.co/E3o0kO6zWJ— Manoj Tiwari (@ManojTiwariMP) March 20, 2019
Dear @ArvindKejriwal this is quite disgusting. The Swastika is a sacred symbol in Hinduism, Buddhism, Jainism. The Nazis stole this and disfigured it in one of the vilest acts of cultural desecration. You are doing the same. If nothing read Wikipedia: https://t.co/l3GPOhd1qQ https://t.co/NFRChsUKHE
— HindolSengupta (@HindolSengupta) March 20, 2019