KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ ఇక్కడ పావులు కదుపుతున్నారు. ఈ గేమ్ ప్లే లో భాగంగా తాజాగా మరో నిర్ణయం అమలులోకి వచ్చింది. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Read More: KCR: కేసీఆర్కు ఏకు మేకు అవుతున్న దళితబంధు!
ప్రభుత్వ కీలక నిర్ణయం…
వరంగల్, హన్మకొండ చారిత్రక నేపథ్యాలు, కాకతీయుల కాలం నుండి ఈ రెండు ప్రాంతాలకు ఉన్న ప్రాశస్త్యాన్ని పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. వరంగల్ మహా నగర ప్రజల విజ్ఞప్తుల మేరకు పార్టీకి చెందిన మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిసి ఈ జిల్లాల ఏర్పాటు గురించి కోరగా ఈ మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రకటించుకుంటున్నాయి. అయితే, అసలు ట్విస్టు వేరంటున్నారు.
Read More : KCR: కేసీఆర్కు షాక్ ఇస్తున్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు
కేసీఆర్ లెక్కలు వేరేనా?
త్వరలో ఉప ఎన్నికలు ఎదుర్కోనున్న హుజురాబాద్ నియోజకవర్గంకు వరంగల్ జిల్లాతో కీలక సంబంధాలు ఉన్నాయి. వారి ఆర్థిక, వ్యాపార పరమైన లావాదేవీలకు వరంగల్ జిల్లాను ఎక్కువగా ఎంచుకుంటుంటారు. ఇలాంటి సమయంలో నియోజకవర్గ ప్రజల సెంటిమెంంట్ గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని, తాజాగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఉప ఎన్నికను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు.