Car: ప్రపంచవ్యాప్తంగా కలకలంగా మారిన అప్గానిస్తాన్ అంతర్గత పరిణామాల్లో మొత్తానికి తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పారిపోయిన పరిస్థితి. అయితే, ఈ ఎపిసోడ్పై కొత్త చర్చ జరుగుతోంది. పారిపోయిన అధ్యక్షుడు తన వాదన వినిపిస్తుంటే, తాలిబన్లను అడ్డుకోవటంలో దేశ అధ్యక్షుడు విఫలమయ్యారని చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. దీంతో అసలు దేశంలో ఏం జరుగుతోందన్న చర్చ వినిపిస్తోంది.
Read More: America :ఇండియన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా కొత్త అధ్యక్షుడు
అధ్యక్షుడు ఏమంటున్నారంటే…
తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకుంటున్న సమయంలో చెప్పపెట్టకుండా అప్గానిస్థాన్ ను వీడిపోయిన ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రియాక్ట్ అయ్యారు. తాను దేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరిస్తూ ఫేస్ బుక్ లో మెసేజ్ చేశారు. దేశ ప్రజల కోసమే తాను వెళ్లిపోయానని మరింత రక్తపాతం సృష్టించటం ఇష్టం లేకే ఆ పనిచేయాల్సి వచ్చింది. నేను మరింత ఆలస్యం చేసి ఉంటే ఎంతో మంది దేశ భక్తులు ప్రాణాలు కోల్పోయేవారని చెప్పారు. ఇక నుంచి దేశ రక్షణ బాధ్యత తాలిబన్లదేనని చెప్పారు. కాగా, కాబూల్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్ష భవనం నుంచి ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు నాలుగు కార్లు, విమానం నిండా డబ్బుతో దేశం విడిచివెళ్లాడని కాబూల్లో రష్యా రాయబారి వెల్లడించడం కలకలం రేపింది.
Read More: America :ఇండియన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా కొత్త అధ్యక్షుడు
నువ్వో దేశద్రోహివి…
అయితే, ఈ ఎపిసోడ్పై విచిత్రంగా భారత్ లోని అప్గాన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ నుంచి ఊహించని ట్వీట్ ఒకటి వచ్చింది.అందులో అప్గాన్ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు ఉన్నాయి. నువ్వో దేశద్రోహివి. నువ్వు చేసిన పనికి మేమంతా సిగ్గుపడుతున్నామని ఉంది. ‘మేం సిగ్గుతో బాధపడుతున్నాం. ఘనీ బాబా(అష్రాఫ్ గనీ) సన్నిహితులతో కలిసి దేశం విడిచి పారిపోయారు. ఆ దేశద్రోహిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు. అలాంటి వ్యక్తికి సేవ చేసినందుకు క్షమించండి’. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఐతే కొద్ది సేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేశారు.