Balakrishna: ఇటీవల కాలంలో పాన్ ఇండియా చిత్రాల హవా భారీగా పెరిగి పోయింది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నీ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం `పుష్ప ది రైజ్`తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించి సూపర్ సక్సెస్ అయ్యాడు.
అయితే ఇప్పుడు బన్నీ బాటలోనే బాలయ్య కూడా వెళ్లబోతున్నారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా మెరవబోతోంది.
ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అనే భయంకరమైన విలన్ పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ కనిపించబోతుండగా.. మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించబోతోంది. తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ఓ యాక్షన్ ఎపిసోడ్తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారని, మైత్రీ మూవీ మేకర్స్ వారు అందుకు సన్నాహాలు చేస్తున్నారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి.. నెట్టింట వైరల్గా మారింది. మరి ఈ వార్తే నిజమైతే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.