మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని గంటల్లో గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్` కు రీమేక్ ఇది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు తెలుగుతో పాటు హిందీ లోనూ విడుదల కాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. మెగా ఫ్యాన్స్ ను బాధ పెట్టే బ్యాడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అదేంటంటే.. చిరంజీవి చేతిలో ఉన్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. ప్రముఖ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ `మెగా 154` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటోంది.
శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ మూవీ విడుదల వాయిదా పడబోతోందట. రెండు నెలల షూట్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి.
అలాగే కనీసం ఒక నెల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ షురూ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ హడావిడిగా కానిచ్చే కంటే టైం తీసుకుని కూల్ గా పూర్తి చేయడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే `వాల్తేరు వీరయ్య`ను సంక్రాంతి కి కాకుండా వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.