Guppedantha Manasu November 28 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 28వ తేదీ Guppedantha Manasu సీరియల్ 619వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.జగతికి రక్తం అవసరం అయితే రిషినే జగతికి రక్తం ఇస్తాడు.ఆక్సిడెంట్ విషయం తెలుసుకున్న ఫణేంద్ర, దేవయానీలు హాస్పిటల్ కు రావడం చూసి గౌతమ్ వాళ్లని జగతీ వాళ్ల ఉన్న చోటికి తీసుకుని వెళ్తాడు.
ఆనందంలో జగతి :
ఈ క్రమంలోనే నేటి కథనం ఆసక్తిగా సాగిందనే చెప్పాలి.ఇక ఫణేంద్ర.. రిషి, గౌతమ్లతో.. జగతీ, మహేంద్రల ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఈలోపు దేవయాని జగతీ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే సృహలోకి వచ్చిన జగతీకి రిషి రక్తం ఇచ్చాడని తెలిసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్గా సాగుతుంది. అప్పుడే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. ‘ఏంటి జగతీ.. ఈ అవకాశాన్ని కూడా బాగానే నీకు అనుకూలంగా మార్చుకున్నావ్గా అంటూ వెటకారం చేస్తుంది.
దేవయాని వెటకారం.. మహేంద్ర ఆగ్రహం :
ఆ మాటలకు జగతీ అల్లాడిపోతుంది. మహేంద్రలు మాత్రం కాస్త కోపంగా మంచిగా మాట్లాడితే బాగుంటుందని’ వార్నింగ్ ఇస్తాడు. కానీ దేవయాని మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో సృహలో లేనట్లు నటించడం ఎంతసేపులే అయినా రక్తం ఇచ్చినంత మాత్రాన్ని రిషి ఏం దగ్గరైపోడు’ అంటూ జగతిని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది.ఆ మాటలకు మహేంద్రకు చాలా కోపం వస్తుంది. ‘వదినగారు.. మర్యాదా అంటూ ఆవేశపడుతుంటే నర్స్ వచ్చి ఇది హాస్పిటల్ ఇలా అరవకూడదు ముందు బయటకు వెళ్ళండి అంటుంది.. అప్పటికే.. ఫణేంద్ర, గౌతమ్, రిషీలు డాక్టర్తో ‘ఇంటికి తీసుకుని వెళ్లి నర్స్ సాయంతో ట్రీట్మెంట్ ఇప్పిద్దాం’ అని మాట్లాడేసి.. లోపలికి వస్తూ ఉంటాడు. ఇక వెంటనే దేవయాని ప్లేట్ మార్చేస్తుంది. ‘వసుధార జగతీని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది అలాగే జగతీ నువ్వేం భయపడదు.. నీకు తగ్గిపోతుంది’ అంటూ దుప్పటి కప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తుంది. మహేంద్ర, జగతీ, వసులు షాక్ అయిపోతారు.
రిషికి ప్రేమతో ఇడ్లీ తినిపించిన వసు:
ఇక మరోవైపు కొద్ది సేపు అయ్యాక వసు.. రిషికి ఇడ్లీ తీసుకుని తినమని అడుగుతుంది నాకు వద్దు అని రిషి అనడంతో వసునే రిషిని పిలిచి ప్రేమగా తినిపిస్తుంది. ఇంతలో గౌతమ్.. ‘రేయ్ రారా.. వాళ్లని డిశ్చార్జ్ చేస్తారట’ అనడంతో.. వసు, రిషీలు వెళ్తారు. గౌతమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ల కోసం. ఇక అప్పుడే రిషికి ఓ ఫోన్ వస్తుంది. ఆ ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే.. రిషి.. ‘వసుధారా నువ్వు వెళ్లు.. నేను వస్తాను’ అనేసి గౌతమ్ దగ్గరకు ఆవేశంగా వచ్చి కాలర్ పట్టుకుంటాడు.
నిజం తెలుసుకున్న రిషి:
‘రేయ్ నేను డాడ్ కోసం ఇంతకాలం తపిస్తుంటే ఆయన నీ దగ్గరే ఉంచుకుని తమాషా చూశావా? నన్ను మోసం చేస్తావా?’ అంటూ తిట్టిపడేస్తాడు గౌతమ్.. రేయ్ రేయ్ రిషీ ప్లీజ్రా నా మాట వినరా అని గౌతమ్ ప్రాథేయపడతాడు. రిషి వెంటనే భుజం మీద చేయేసి.. ‘ఏ మాట వినాలిరా? ఏం అయ్యింది? ఎందుకు అలా అరుస్తున్నావ్’ అనేసరికి తేరుకుంటాడు గౌతమ్.అంటే ఇదంతా గౌతమ్ ఊహ అనుకుని కూల్ అవుతాడు..ఇక వెంటనే రిషి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావ్ అంటాడు. ఏమిలేదు అని గౌతమ్ కవర్ చేస్తాడు.ఇక మరోవైపు జగతీ, మహేంద్రలు ఇంటికి వెళ్లడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘రిషీ కళ్లల్లో ఆనందం చూడాలి’ అనుకుంటూ పొంగిపోతూ ఉండడంతో సీరియల్ ముగుస్తుంది.