YS Jagan: విధి నిర్వహణలో తన అభిమానాన్ని చొరగొంటే ఉన్నతాధికారులు పదవీ విరమణ అయినా వారికి కీలక పోస్టులు కట్టబెడుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆగ్రహం తెప్పిస్తే మాత్రం ఆ అధికారిని అవమాకరంగా పంపించి వేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నలుగురిలో ఒక్కరికి మినహా మిగిలిన అధికారులు పదవీ విరమణ తర్వాత కీలక పోస్టుల్లో కూర్చొబెట్టారు సీఎం జగన్. అభిమానిస్తే అందలం ఎక్కిస్తారు, ఆగ్రహం కల్గిస్తే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
జగన్ సర్కార్ లో మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా బాధ్యతలు నిర్వహించిన ఎల్వీ సుబ్రమణ్యం విషయంలో తేడా రావడంతో ఆయన పదవీ విరమణకు ఆరు నెలల ముందే ఆ పోస్టు నుండి తొలగించి ఏపి మానవ వనరుల శాఖ డీజీగా నియమించారు. ఓ ఉన్నత హోదాలో పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం అవమానకరంగా పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత జగన్ సర్కార్ లో సీఎస్ లుగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ అధికారులు మాత్రం ఆయన అభిమానాన్ని చొరగొన్నారు. సీఎస్ గా ఆరు నెలలు చొప్పున ఒకటి రెండు సార్లు ఎక్స్ టెన్షన్ లభించింది. పదవీ విరమణ తర్వాత కీలక పోస్టులు లభించాయి.
ఎల్వీ సుబ్రమణ్యం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పదవీ విరమణ అయిన వెంటనే సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా కేబినెట్ ర్యాంక్ లో నియమితులైయ్యారు. తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ కాగానే ఆ పోస్టులో నియమితులైయ్యారు నీలం సాహ్ని. ఆ తర్వాత సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ కాగానే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారుగా న్యూఢిల్లీలో ఏపి భవన్ కు నియమితులైయ్యారు. తాజాగా నేడు రిటైర్ అవుతున్న సమీర్ శర్మ కోసం ప్రత్యేకంగా సీఎంఓలో ఓ కీలక పోస్టును క్రియేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీ హోదాలో సమీర్ శర్మ .. సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా రేపు సీఎంఓలో బాధ్యతలు చేపట్టనున్నారు.
సమీర్ శర్మతో పాటు మరో సీనియర్ ఐఏఎస్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ విజయకుమార్ నేడు పదవీ విరమణ అవుతున్నారు. జిల్లాల విభజన ను ఆయన సమర్దవంతంగా పూర్తి చేశారు. ఆయనను స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటి సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫిషియో సెక్రటరీ హోదాలో విజయకుమార్ రేపటి నుండి బాధ్యతలు నిర్వహించనున్నారు. జగన్ హయాంలో అయిదవ సీఎస్ గా జవహర్ రెడ్డి నియమితులైయ్యారు.
TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?